పౌరసత్వ నిరసన చట్టం-2019పై దేశవ్యాప్తంగా జనాగ్రహం వ్యక్తమవుతోంది. దీన్ని ఎదుర్కునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఐతే CAAపై నిరసనలను కౌంటర్ చేసే క్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నోరు జారారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి తారా స్థాయికి చేరుకుంది. పోలింగుకు ఇంకా నాలుగు రోజులే ఉండటంతో అన్నీ ప్రధాన పార్టీలు తమ ప్రచారాలన్నీ ఉదృతం చేశాయి. ఇందులో భాగంగా శనివారం కామారెడ్డిలో మజ్లీస్ నేత ఎంపీ అసదుద్దిన్ ఓవైసి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించండి అని అయన ఓటర్లకు పిలుపునిచ్చారు.
జేఎన్యూలోకి దుండుగులు ప్రవేశించి దాడి చేసిన ఘటనలో 28 మంది విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది. కొందరు విద్యార్థులు తలకు కట్లతో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చురలంటించారు. తాను భారత ముస్లిం అయినందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. భారత ముస్లింల గురించి ఆలోచించడం కన్నా పాకిస్థాన్ ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించడం ఉత్తమమని హితవు పలికారు.
ఎంఐఎం పార్టీ నేతలు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి సైతం కామెంట్లు చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.