తెలంగాణ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీ నేతల్ని బట్టలిప్పి కొడతానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఓ వర్గానికి కొమ్ముకాస్తూ..బీజేపీని మతతత్వ పార్టీగా చిత్రీకరిస్తున్నాడని బండి సంజయ్ ఆరోపించారు.
Jeevitha Rajasheker: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికి పైగా గడువున్నా ముందస్తు వస్తుందన్న ప్రచారంతో పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. వరుస కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్న పార్టీలు తమ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించుకుంటున్నాయి.
Amit Shah: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందన్న దానిపై క్లారిటీ లేదు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు నిర్వహిస్తారా లేక గుజరాత్ అసెంబ్లీ పోల్స్ తో పాటు జరుగుతుందా అన్న దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.
Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తుపై కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ తో పొత్తు సమస్యే లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నా.. జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిపి పోటే చేసే అవకాశాలు ఉన్నాయనే వాదన ఉంది.
KCR JAIL: బండి సంజయ్ కామెంట్లతో రంగంలోకి దిగింది కాంగ్రెస్. బీజేపీ నేతలకు షాకిచ్చింది. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం సోమవారం ఉదయం కరీంనగర్ జైలుకు వెళ్లింది.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు ఇస్తూనే ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చిన ఘనత మోదీ సర్కార్దే అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలో నిర్వహించిన సభలో కిషన్ రెడ్డి మాట్లాడారు.
Bandi Sanjay: సీఎం కేసీఆర్ కుటుంబం టార్గెట్ గా మరింత దూకడు పెంచింది తెలంగాణ బీజేపీ. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కమలం నేతలు.. కేసీఆర్ కుటుంబాన్ని ఇరికించేలా వ్యూహాలు రచిస్తున్నారు.
బీజేపీ నుంచి సస్పెన్షన్కు గురైన హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై నమోదైన పీడీ యాక్ట్ కేసుపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో ఒక ప్రజాప్రతినిధిపై పీడీ యాక్ట్ నమోదవడం ఇదే తొలిసారి. ఈ పీడీ యాక్ట్పై అడ్వైజరీ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటనేది చర్చనీయాంశంగా మారింది.
ఒక వర్గాన్నిలక్ష్యంగా చేసుకుని ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని పాతబస్తీ అట్టుడుకుతోంది. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. శాలిబండలో రాజాసింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
Amit Shah Ntr Meet: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వేళ ఎన్టీఆర్తో ఆయన భేటీ పలు ఊహాగానాలకు , చర్చలకు తెరలేపింది. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో ఆదివారం (ఆగస్టు 21) రాత్రి 10.30 గం. సమయంలో ఈ ఇద్దరి భేటీ జరిగింది. దాదాపు 50 నిమిషాల పాటు ఈ భేటీ జరగ్గా.. 20 నిమిషాల పాటు ఇద్దరు ఏకాంతంగా చర్చించుకున్నారు. భేటీ సందర్భంగా ఎన్టీఆర్ అమిత్ షాను మర్యాదపూర్వకంగా పుష్ప గుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి సత్కరించారు.
Amit Shah Ntr Meet: అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. అనూహ్యంగా జరిగిన ఈ భేటీ వెనుక బీజేపీ వ్యూహమేంటనేది చర్చనీయాంశంగా మారింది.
Ponguleti Srinivas Reddy to join BJP: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ను వేగవంతం చేసింది. అధికారపార్టీ నేతలే టార్గెట్గా మంత్రాంగం నడుపుతున్న ఈటల రాజేందర్కు బడా లీడర్ చిక్కినట్లే కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై కొంతకాలంగా గుర్రుగా ఉన్న ఆ నేత బీజేపీ వైపు చూస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆ నేత మరెవరో కాదు.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే అనే టాక్ బలంగా వినిపిస్తోంది.
Telangana BJP: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.త్వరలో మునుగోడు ఉప ఎన్నిక జరగనుండటంతో తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం జరిగింది.తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది.
Telangana BJP: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక జరగనున్న సమయంలో బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది.తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ గా సునీల్ బన్సల్ ను నియమించింది.
Bandi Sanjay Yatra: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటి నుంచి సాగనుంది. ఈసారి యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం నుంచి వరంగల్ భద్రకాళి వరకు ఆలయం వరకు యాత్ర సాగనుంది. పాదయాత్రలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగనున్నారు బండి సంజయ్.
Telangana Politics: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి కనిపిస్తోంది. జోరుగా నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. అధికార ,విపక్షాలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తమ పార్టీలో ఉన్న నేతలను కాపాడుకుంటూనే.. ఇతర పార్టీల నేతలు తమ పార్టీలో చేరేలా పావులు కదుపుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.