Revanth Reddy About ORR Scam: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై పలు సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌజ్లో, కేటీఆర్ విదేశాల్లో స్థిరపడినా వందల కోట్లు వచ్చిపడేలా ఆదాయ వనరులు ప్లాన్ చేశారన్నారు.
KCR's First Signatures in Telangana New Secretariat: హైదరాబాద్: కొత్తగా ప్రారంభోత్సవం జరుపుకున్న నూతన సచివాలయంలోని తన ఛాంబర్ లో విధులు చేపట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారిగా పలు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు.
Bandla Ganesh Son School స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో బండ్ల గణేష్ కొడుకులు సందడి చేశారు. బండ్ల గణేష్ కొడుకులిద్దరూ కూడా తమ స్కూల్ చదువల్ని పూర్తి చేసుకున్నారు. 12వ తరగతి పూర్తయిన సందర్భంగా పట్టాలు పుచ్చుకున్నారు.
Revanth Reddy Press Meet About ktr: ఈ ప్రాజెక్టులో ఒక్కో అపార్ట్మెంట్ సగటున 8000 ఎస్ఎఫ్టీతో నిర్మాణం చేపడుతున్నారు. ఇట్లా 200 అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. ఇంత లగ్జరీ (సుమారు రూ.20 కోట్లకు ఒక అపార్ట్మెంట్) అపార్ట్మెంట్ కొనుగోలు చేసే వాళ్లు ఇంటికి కనీసం 5 కార్లు ఉంటాయి. ఆ లెక్కన వేసుకుంటే మొత్తం 1000 కార్లు ఈ నిర్మాణంలో ఉంటాయి. ఈ వెయ్యి కార్లు ఉదయం ఒకేసారి బయటకు వస్తే పరిస్థితి ఊహించుకోవచ్చు.
Revanth Reddy Slams KCR and KTR: కేబీఆర్ పార్కు నుంచి క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లే దారిలో బీసీ స్టడీ సర్కిల్ సమీపంలో నిజాం నవాబులకు చెందిన ఒక హెరిటేజ్ భవనం ఉండేది. ఈ భవనాన్ని కుర్ర శ్రీనివాస రావుకు చెందిన కేఎస్ అండ్ సీఎస్ డెవలపర్స్ అనే సంస్థ కొనుగోలు చేసింది. ఈ స్థలంలో కమెర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం విషయంలో ఎన్నో అవకతవకలు జరిగాయని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
KTR questions to Centrl Govt on Singareni Mines Privatization: తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణపై మోదీ ప్రభుత్వ వైఖరిని మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. గనుల్ని వేలం జాబితా నుంచి తప్పించే విషయంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిబంధన ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దేశంలో బొగ్గు గనుల ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర వైఖరిపై మండిపడ్డారు.
Etala Rajender Slams KCR: భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్కరు కూడా వారసత్వంతో ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు కాలేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకుంటున్నా.. అది ఒక కుటుంబ పార్టీ, అందుకే కునారిల్లిపోతున్న దుస్థితిలో ఉంది. కార్యకర్తల కమిట్మెంట్, ప్రజల ఆశీస్సులతోనే గెలుపు సాధ్యమవుతుందని భావించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని బీజేపి నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
KTR Writes Open Letter to Centre: మంత్రి కేటీఆర్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ అనేక అంశాలను మంత్రి కేటీఆర్ ఈ లేఖలో ప్రస్తావించారు. పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.
Bandi Sanjay Reaction on KTR Notices: కేసీఆర్ కొడుకు పరువు, ప్రతిష్ట విలువ ప్రస్తుతం రూ. 100 కోట్లయితే, తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 30 లక్షల మంది యువత భవిష్యత్ మీ పాలనవల్ల ప్రశ్నార్థమైంది. మరి వారికెంత మూల్యం చెల్లిస్తారో చెప్పాలి. పరువు నష్టం పేరుతో కూడా డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటు అంటూ మంత్రి కేటీఆర్ పై బండి సంజయ్ నిప్పులు చెరిగారు.
KTR Defamation Suit: హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఏఈ పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారంలో తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు బండి సంజయ్లకు మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు లీగల్ నోటీసులు పంపారు.
Minister KTR Writes Letter to Central Govt: కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ సాధ్యం కాదని కేంద్రం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న నగరాలకు అనుమతి ఇచ్చి.. హైదరాబాద్కు అనుమతి లేదని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందని లేఖలో పేర్కొన్నారు.
Sirisilla District Minister KTR: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో పర్యటించారు. దళిత బంధు పథకంలో వచ్చిన సొమ్ములతో ఏర్పాటు చేసిన రైస్ మిల్లును ఆయన ప్రారంభించి మరిన్ని పనులకు శ్రీకారం చుట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.