Delhi Assembly Polls | ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ హామీ అరవింద్ కేజ్రీవాల్ను చిక్కుల్లో నెట్టింది. బీజేపీ ఫిర్యాదుతో స్పందించిన ఈసీ సీఎం కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ నగరంలోని షాహీన్ బాగ్ వద్ద పౌరసత్వ సవరణ చట్టంపై నిరంతర నిరసనలపై భారతీయ జనతా పార్టీ నాయకులు పదేపదే ఆమ్ ఆద్మీ పై చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొట్టారు. తరుచుగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలపై బీజేపీపై మండిపడ్డారు.
దేశంలో ప్రజాదరణ ఉన్న నేతల్లో ఒకరైన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. భార్య పేరిట ఉన్న ఆస్తుల వివరాలను పొందుపరిచారు.
దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా పది తాజా ముఖ్యాంశాలను ఒక్క చోట చేర్చి అందించే ప్రయత్నమే ఈ టాప్ 10 జాతీయ వార్తలు. దేశంలో ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. రోడ్ షోకు భారీగా జనాలు రావడంతో నిర్ణీత సమయానికి కేజ్రీవాల్ కమిషనర్ కార్యాలయానికి చేరుకోలేకపోయారు.
ఢిల్లీలో మహిళలకు ఇదివరకే ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోన్న కేజ్రీవాల్ సర్కార్.. తమను మరోసారి ఎన్నుకుంటే విద్యార్థులకు కూడా ఆ సౌకర్యాన్ని అందిస్తామని కార్డులో తెలిపారు.
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు పోటీగా న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారా అన్న ప్రశ్నకు ఆశా దేవి పై విధంగా స్పందించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెల కన్నా తక్కువ సమయం ఉన్నందున, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేడు దేశ రాజధానిలోని మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇందులో
గత అయిదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన పనులతో హ్యాపీగా ఉన్నట్లయితే ఆప్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ కోరారు. సీఏఏ ఢిల్లీ ఓటర్లను ఏ విధంగానూ ప్రభావితం చేయదని, దేశ రాజధాని ప్రజలు కేవలం అభివృద్ధికి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.
జామియా మిల్లియా ఇస్లామియ యూనివర్శిటీ విద్యార్థి(Jamia Millia Islamia university students) సంఘాలు, పలువురు సిబ్బంది ఆదివారం రాత్రి పొద్దుపోయాకా ఓల్డ్ ఢిల్లీ పోలీసు హెడ్ క్వార్టర్స్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. జామియా మిల్లియా ఇస్లామియ యూనివర్శిటీ క్యాంపస్లోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించడమే కాకుండా.. ఆందోళనతో సంబంధం లేని విద్యార్థులు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు.
ఢిల్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యూహం సిద్ధం చేశారు. సక్సెస్కు మారు పేరుగా ఉన్న ప్రశాంత్ కిశోర్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రశాంత్ కిశోర్కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ I-PACతో ఒప్పందం ఖరారైంది.
ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలో దాదాపు కేంద్రానికి వ్యతిరేకంగా పనిచేస్తోన్న రాజకీయ పార్టీలన్నీ ఏకమైన సంగతి తెలిసిందే. ఎన్నికల అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవం వేదికపై ఒక్కచోటకు చేరిన ప్రతిపక్షాలను చూస్తే 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ ఎన్డీఏను ఎదుర్కునేందుకు ఈ పార్టీలన్నీ ఏకమవుతాయా అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలా ఏకమైన ప్రతిపక్ష పార్టీలతో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం చేయి కలపడంతో 2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమితో అరవింద్ కేజ్రీవాల్ చేయి కలుపుతారా అనే చర్చ కూడా జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.