ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కేజ్రీవాల్ కేబినెట్ మంత్రులతో ఎల్జీ అనిల్ బైజాల్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఆయనతోపాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారందరితో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి విజయాన్ని అందించిన ప్రశాంత్ కిషోర్ తర్వాతి లక్ష్యం ఆ రెండు రాష్ట్రాలు. ఇందుకోసం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోనే పీకే శ్రీకారం చుట్టారు.
ఎన్నికల్లో విజయం సాధించిన రోజే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై కాల్పులు జరగడం ఢిల్లీలో కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసి విచారణ చేపడితే నిందితుడు దొరుకుతాడని ఎమ్మెల్యే నరేష్ యాదవ్ పేర్కొన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండో పర్యాయం కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. ఆ పార్టీ సాధించిన ఓట్ల శాతం సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యేలా ఉంది.
Delhi Election Results | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతున్న రోజే లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్లో అధికార ఆప్ ఆద్మీ పార్టీ మరోసారి సత్తా చాటింది. ఆప్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అభినందించారు.
ఢిల్లీ ప్రజలకు 200యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తామన్న అరవింద్ కేజ్రీవాల్ ప్రకటనే ఆప్ విజయానికి బాటలు వేసిందన్నారు బీజేపీ ఎంపీ రమేష్ బిదురి. తాజా ఓట్ల లెక్కింపులో ఆప్ 55స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ముందుగా ఊహించినట్లుగానే, ఎగ్జిట్ పోల్స్ చాలావరకు ఆమ్ ఆద్మీ పార్టీయే మంచి ఫలితాలను సాధిస్తుందని, ఢిల్లీ ఎన్నికల విజయం బీహార్ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని ఆప్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అన్ని ప్రధాన ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సౌకర్యవంతమైన మెజారిటీ సాధిస్తారని అంచనా వేశాయి. గత ఐదేళ్ళలో ఆప్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలపై సాగించిన ఎన్నికల ప్రచారానికి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం వహించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ శనివారం ట్వీట్ చేశారు. మహిళలు అధిక సంఖ్యలో వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. స్మృతి ఇరానీ తన ట్విట్టర్ లో పేర్కొంటూ.. ఢిల్లీ మహిళలు ఎంతో చైతన్య వంతులని, ఎవరికి ఓటు వేయాలో తమను తాము నిర్ణయించుకునేంత సామర్థ్యం ఉన్న మహిళలలని ఆమె అన్నారు.
మహిళలు ఇంటి బాధ్యత ఎంత బాగా నిర్వహిస్తారో, నేడు ఎన్నికల బాధ్యతను కూడా అదే తీరుగా స్వీకరించాలంటూ ఢిల్లీ ఓటర్లకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఢిల్లీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
నేడు ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. షాహీన్బాగ్ పరిధిలోని 5 పోలింగ్ కేంద్రాలను సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు.
భారతీయ జనతా పార్టీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలపాలని సవాలు విసిరిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బుధవారం వరకు గడువిచ్చిన సంగతి తెలిసిందే. నేడు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బహిరంగ చర్చకు రావాలని ఆహ్వానించారు. చర్చ బహిరంగ ప్రదేశంలో, మీకు నచ్చిన యాంకర్తో ఢిల్లీ ప్రజల ముందుండాలని ఆయన అన్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ జోరుగా ప్రచారం చేస్తుండగా. . ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ గట్టిగా పోరాడుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.