తిరుపతి ఎంపీ, వైసిపి నేత బల్లి దుర్గాప్రసాద్ రావు (64) ఇక లేరు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఆయన చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కొవిడ్-19 చికిత్స ( COVID-19 ) పొందుతున్న బల్లి దుర్గాప్రసాద్కు తీవ్ర గుండెపోటు ( Heart attack ) వచ్చిందని.. ఈ కారణంగానే ఆయనను రక్షించుకోలేకపోయామని ఆసుపత్రివర్గాలు తెలిపాయి.
Tamil director Balamithran | లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ లేకపోవడం, చేస్తున్న సినిమాల పనులు మధ్యలోనే ఆగిపోవడం వంటి పరిణామాలు సినీ కళాకారులను తీవ్ర మానసిక ఒత్తిడికి (Mental stress) గురిచేస్తున్నాయి. కొంతమంది ఆ ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఇంకొంత మంది వాటిలోంచి బయటికి రాలేకపోతున్నారు.
ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులను మిమిక్రీ చేసిన ఆ గొంతు ఇక శాశ్వతంగా మూగబోయింది. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు హరి కిషన్ (57) ( Mimicry artist Harikishan ) ఇక లేరు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాసవిడిచారు. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరు, నాగార్జున, బాలకృష్ణలతో పాటు ఈ తరం హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి ఎందరో స్టార్ హీరోలను ఇమిటేట్ చేయడంలో హరి కిషన్ నెంబర్ 1 మిమిక్రీ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.